NaraLokesh : సింగపూర్‌లో లోకేశ్ ముమ్మర పర్యటన: ఏఐ, సెమీకండక్టర్ రంగాల్లో పెట్టుబడుల ఆహ్వానం

Andhra Pradesh Minister Nara Lokesh's Singapore Visit: Key Meetings with Microsoft, Semiconductor, and Other Companies

NaraLokesh : సింగపూర్‌లో లోకేశ్ ముమ్మర పర్యటన: ఏఐ, సెమీకండక్టర్ రంగాల్లో పెట్టుబడుల ఆహ్వానం:ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలోని బృందం సింగపూర్ పర్యటనలో భాగంగా పలు ప్రముఖ సంస్థలను సందర్శించి, కీలక సమావేశాలు నిర్వహించింది.

ఏపీ మంత్రి నారా లోకేశ్ సింగపూర్ పర్యటన: మైక్రోసాఫ్ట్, సెమీకండక్టర్, ఇతర సంస్థలతో కీలక భేటీలు

ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలోని బృందం సింగపూర్ పర్యటనలో భాగంగా పలు ప్రముఖ సంస్థలను సందర్శించి, కీలక సమావేశాలు నిర్వహించింది. ఈ పర్యటనలో భాగంగా మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్, ఇన్ఫినియన్ సెమీకండక్టర్స్ యూనిట్, ఐవీపీ సెమీ, డీటీడీఎస్, క్యాపిటాల్యాండ్ వంటి సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు.

నారా లోకేశ్ బృందం సింగపూర్ సెసిల్ స్ట్రీట్‌లోని మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను సందర్శించింది. అక్కడ ఏఐ గోస్టోర్‌లో వివిధ పరిశ్రమలు, ఆరోగ్య సంరక్షణ, ఎఫ్ఎస్ఐ (ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండస్ట్రీ), తయారీ, వినియోగదారు పరిశ్రమల్లో ఏఐ వినియోగ దృశ్యాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రత్యేకతలను వివరిస్తూ, వ్యాపారులు, వినియోగదారులు, ప్రేక్షకులకు సంయుక్తంగా రిటైల్, విద్యకు మద్దతు అందించేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎగ్జిక్యూటివ్ బ్రీఫింగ్‌లు, పరిశ్రమ పరిష్కారాలను ఊహించడం, ఆవిష్కరణల వర్క్‌షాప్‌లు, హ్యాండ్స్-ఆన్ ల్యాబ్‌లు, క్లయింట్ల డిజిటల్ పరివర్తన మార్గాలపై దృష్టి సారించడం వంటి సేవలను అందిస్తున్నామని పేర్కొన్నారు.

ముఖ్యంగా, ఐబీఎం, డెల్ వంటి మైక్రోసాఫ్ట్ కస్టమర్‌లు, ప్రభుత్వ రంగ సంస్థలు సాంకేతిక ఇంటిగ్రేషన్, ట్రాన్స్‌ఫర్మేషన్ కోసం ఈ కేంద్రాలను ఉపయోగిస్తున్నాయని చెప్పారు. ఐబీఎం-మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్స్ జోన్ ప్రత్యేకంగా క్లయింట్‌లకు అజ్యూర్, కోపైలట్ వంటి సాంకేతికతలను ఉపయోగించి ఏఐ ఆధారిత వ్యాపార పరిష్కారాలను చూపడంలో సహకరిస్తుందని వివరించారు. అనంతరం ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ఛాంబర్‌లో మైక్రోసాఫ్ట్ గవర్నమెంట్ ఎఫైర్స్ హెడ్ మార్కస్ లోహ్, లీగల్ అఫైర్స్ హెడ్ జాస్మిన్ బేగం, సీటీఓ మార్క్ సౌజాలతో మంత్రి లోకేశ్ సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, జనరేటివ్ ఏఐ ఆధారిత పరిష్కారాలను కనుగొని సమన్వయం చేయడానికి ఆంధ్రప్రదేశ్‌లో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్స్ జోన్/టెక్నాలజీ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. భారతదేశంలోని అతిపెద్ద నైపుణ్యం కలిగిన ఐటీ నిపుణుల సమూహాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటని, అమెరికాలోని భారతీయ ఐటీ శ్రామిక శక్తిలో 25 శాతం కంటే ఎక్కువ మంది తెలుగు సమాజం నుండి వచ్చారని గుర్తు చేశారు.

అమరావతి క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్‌లో అజ్యూర్ ఓపెన్‌ఏఐ సర్వీస్, మైక్రోసాఫ్ట్ కోపైలట్‌ను ఉపయోగించి పరిష్కారాలను అన్వేషించడానికి మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ఆధ్వర్యాన 2026లో హ్యాకథాన్‌ను నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. దీనికి అవసరమైన అన్ని సౌకర్యాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పిస్తుందని హామీ ఇచ్చారు. మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ భాగస్వామ్యంతో జనరేటివ్ ఏఐ, హైబ్రిడ్ క్లౌడ్, మైక్రోసాఫ్ట్ ఉత్పత్తులలో నైపుణ్యం కలిగిన ఐటీ వర్క్‌ఫోర్స్‌ను అభివృద్ధి చేయడానికి ఏపీలోని టాలెంట్ పూల్‌ను ఉపయోగించుకోవాలని సూచించారు.

అనంతరం మంత్రి లోకేష్ బృందం ఇన్ఫినియన్ సెమీకండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను సందర్శించింది. ఈ సందర్భంగా ఇన్ఫినియన్ ప్రెసిడెంట్ & ఎండి సిఎస్ చువాతో మంత్రి లోకేష్ మాట్లాడుతూ, ఏపీలో ఈఎంసీలు (ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్) లేదా పారిశ్రామిక పార్కులలో సెమీకండక్టర్స్ తయారీ (బ్యాక్ ఎండ్/అసెంబ్లింగ్, టెస్టింగ్)కి అనుబంధంగా ప్యాకేజింగ్, టెస్టింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని కోరారు.

పవర్ మాడ్యూల్స్, ఇన్వర్టర్లు, బీఎంఎస్ (బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్) వ్యవస్థలను రూపొందించడానికి స్థానిక ఈవీ (ఎలక్ట్రిక్ వెహికల్) పర్యావరణ వ్యవస్థలోని ప్రధాన సంస్థలతో భాగస్వామ్యం వహించాలని సూచించారు. ఇంజనీర్లు, టెక్నీషియన్ల శిక్షణ కోసం సెమీకండక్టర్ స్కిల్ అకాడమీ ఏర్పాటు చేయడానికి ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు సహకారం అందించాలని మంత్రి లోకేశ్ విజ్ఞప్తిచేశారు.

ఐవీపీ సెమీ ఫౌండర్ రాజా మాణిక్కంతో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సింగపూర్ షాంగ్రీలా హోటల్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో సెమీకండక్టర్ పరికరాల తయారీ కేంద్రం లేదా చిప్ డిజైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఇందుకు రాష్ట్ర పారిశ్రామిక క్లస్టర్‌లలో అందిస్తున్న ప్రోత్సాహకాలను ఉపయోగించుకోవాలని అన్నారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై సహచర ఎగ్జిక్యూటివ్‌లతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని రాజా మాణిక్కం తెలిపారు.

డీటీడీఎస్ గ్రూప్ సీఈఓ బీఎస్ చక్రవర్తితో మంత్రి నారా లోకేశ్ భేటీ అయ్యారు. డీటీడీఎస్ పర్యావరణ వ్యవస్థ నిర్మాణ నైపుణ్యాన్ని ఉపయోగించి పరికరాల తయారీకి ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈలకు (సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు) సహకరించాలని విజ్ఞప్తిచేశారు. భారతదేశ సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థలో ప్రాంతీయ సహకారాన్ని గుర్తించి తమిళనాడుతోపాటు ఏపీ సేవలను కూడా వినియోగించుకోవాలని కోరారు.

క్యాపిటాల్యాండ్ ఇన్వెస్టిమెంట్స్ (సీఎల్ఐ) సీఈఓ సంజీవ్ దాస్ గుప్తాతో మంత్రి నారా లోకేశ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, సీఎల్ఐ స్థిరమైన పెట్టుబడులకు ప్రాధాన్యతనిస్తున్నందున విశాఖలోని డేటా సెంటర్‌లను వారి క్యాప్టివ్ పవర్ ప్లాంట్ల ద్వారా పునరుత్పాదక శక్తితో పూర్తిగా శక్తిమంతం చేయవచ్చని చెప్పారు.

సాంప్రదాయ సాఫ్ట్‌వేర్ కంపెనీలు వైజాగ్ వంటి టైర్ 2 నగరాలకు తరలివస్తున్న నేపథ్యంలో వైజాగ్, విజయవాడలో ఐటీ/సాఫ్ట్‌వేర్ పార్కులు, మిశ్రమ అభివృద్ధి నమూనాల ఏర్పాటును పరిశీలించాలని సూచించారు. రాష్ట్రంలోని కీలకమైన పారిశ్రామిక కారిడార్‌లలో పారిశ్రామిక గిడ్డంగులు/పారిశ్రామిక పార్కుల ఏర్పాటు చేయాలని కోరారు. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ ఏర్పాటుచేసే అంశాన్ని పరిశీలించాలని విజ్ఞప్తిచేశారు. దీనిపై సంజీవ్ దాస్ గుప్తా స్పందిస్తూ, ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై సంస్థ ఎగ్జిక్యూటివ్‌లతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

Read also:Infosys : ఐటీ రంగంలో భిన్నంగా ఇన్ఫోసిస్: భారీ నియామకాలతో దూకుడు

 

Related posts

Leave a Comment